ఈ కోర్సులో ఏమి ఉంటుంది అంటే
రైతులు ఎన్నో కష్టాలు పడి, రైతులు పంటలు పండిస్తూ ఉంటారు. అయితే, ఎన్నో కారణాల వల్ల వారు పెట్టిన సొమ్ము కూడా కొన్ని సార్లు వెనక్కి రాకపోవచ్చు. వీటికి అనేక కారణాలు ఉండొచ్చు. ఇలా రైతులు పూర్తి నష్టాలలో కూరుకుపోయి, ఆత్మ హత్యలు చేసుకోవడం దురదృష్టకరం. వీటికి ప్రమాయత్నంగా వచ్చిందే, జీరో బడ్జెట్ నాచ్యురల్ ఫార్మింగ్. మన దేశంలో మొదటిగా మహారాష్ట్రలో పద్మ శ్రీ సుభాష్ పాలేకర్, 1990 సంవత్సరంలో ప్రారంభించారు. నాచ్యురల్ ఫార్మింగ్ చేస్తూ, మనం ఈ సాగులో లాభాలు గడించవచ్చు.
ఇందులో ఖర్చు అనేది చాలా తక్కువ ఉంటుంది . ఎందుకంటే, ఇందులో మనం వాడే వస్తువులు, పదార్ధాలు లేదా ఎరువులు అన్ని మన దగ్గరే లభిస్తాయి కాబట్టి, ఇది చాలా సులువైనది మరియు ఖర్చు తక్కువైనటువంటి ఈ జీరో బడ్జెట్ నాచురల్ ఫార్మింగ్ కు అనుకూలమైన ఈ కోర్సులను చూడండి. మన దేశంలో ఎంతో మంది రైతులు, ఈ విధమైన ఫార్మింగ్ చేస్తూ, ఆర్థికంగా బలపడుతున్నారు. ఈరోజే మీరు కూడా దీన్ని గురించి తెలుసుకొని అత్యుత్తమ లాభాలను పొందండి.